Sunday, April 28, 2024

ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన జూ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్

- Advertisement -
- Advertisement -

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, దివంగత మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఆయన ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ నివాళులర్పించారు. గురువారం తెల్లవారుజామున హైదరాబాద్ లోని డా. బిఆర్ అంబేడ్కర్ సచివాలయం సమీపంలో ఉన్న ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్న ఆయన మనవళ్లు, నటుడు హరికృష్ణ కుమారులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు అంజలి ఘటించారు. జూ.ఎన్టీఆర్ అక్కడి రావడంతో పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు.. దీంతో ఎన్టీఆర్ ఘాట్ వద్ద సందడి నెలకొంది.

ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా టిడిపి పార్టీ ఈరోజు పలు కార్యక్రమాలను నిర్వహించనుంది.రాష్ట్ర బిసి సెల్ అధ్యక్షులు శ్రీపతి సతీష్ ఆధ్వర్యంలో ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ రసూల్ పుర చౌరస్తాలో ఉన్న ఎన్‌టిఆర్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుండి ఎన్‌టిఆర్ ఘాట్ వరకు అమర జ్యోతి ర్యాలీ నిర్వహించనున్నారు. అటు ఉదయం 10 గంటలకు పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎన్‌టిఆర్ ట్రస్టు భవన్ హైదరాబాద్‌లో ఎన్.టి.ఆర్ ట్రస్టు ట్రస్టీ నారా భవనేశ్వరిఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, దివ్యాంగులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అటు యూసప్‌గూడ కృష్ణానగర్‌లో టిడిపి నేతలు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News