Sunday, April 28, 2024

నెలలో ఒకరోజు గజ్వేల్ నియోజకవర్గానికి కేటాయిస్తా: సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

మేడ్చల్: గజ్వేల్ నియోజకవర్గం బిఆర్ఎస్ నేతలతో ముఖ్యమంత్రి కెసిఆర్ శుక్రవారం భేటీ అయ్యారు. మేడ్చల్ తూంకుంటలోని కన్వెన్షన్ హాలులో బిఆర్ఎస్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కెసిఆర్ తో పాటు మంత్రి హరీశ్ రావు, ఒంటేరు ప్రతాపరెడ్డి, రఘోత్తమ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ…. త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో బిఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

95 నుంచి 100 అసెంబ్లీ స్థానాల్లో గెలవనున్నామని ఆయన వెల్లడించారు. విద్యుత్, తాగు నీరు సమస్యలు పరిష్కరించుకున్నామన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఒక్క నిరుపేద ఉండొద్దన్నదే బిఆర్ఎస్ లక్ష్యమన్నారు. ఇకపై ప్రతి నెలలో ఒక రోజు గజ్వేల్ నియోజకవర్గానికి కేటాయిస్తానని కెసిఆర్ పేర్కొన్నారు. రాష్ట్రానికి తమమానికంగా గజ్వేల్ ను తీర్చిదిద్దుతానని కెసిఆర్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News