Tuesday, April 30, 2024

పోరాట యోధుడు బొమ్మగాని ధర్మభిక్షం శత జయంతి.. నివాళులర్పించిన సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బొమ్మగాని ధర్మభిక్షం శత జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సోమవారం ఆయనకు నివాళులర్పించారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, ఎమ్యెల్యేగా, ఎంపిగా, ఆయన సమాజానికి చేసిన సేవలను సీఎం స్మరించుకున్నారు. కమ్యూనిస్టు నాయకునిగా సబ్బండ వర్గాలు, పీడిత ప్రజల హక్కుల కోసం ఆయన ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేశారని సీఎం అన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం నిలిచిన విలువలు కలిగిన నాయకుడుగా ధర్మభిక్షం అందించిన స్పూర్తి నేటి తరాలకూ అనుసరణీయమని సిఎం కెసిఆర్ అన్నారు.

CM KCR pays tribute to Bommagani Dharma Bhiksham

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News