Sunday, April 28, 2024

కారేపల్లి ఘటనపై సిఎం కెసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో జరిగిన ఘోర ప్రమాదం పట్ల బిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఊహించని రీతిలో సిలిండర్లు పేలి ఇద్దరు కార్యకర్తలు మరణించడం, పలువురికి తీవ్ర గాయాలు పాలవ్వడం బాధాకరమని అన్నారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే ఖమ్మం జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌కి, ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఉన్న ఎంపి నామా నాగేశ్వర్ రావులకు ఫోన్లు చేసి ప్రమాదం వివరాలు తెలుసుకున్నారు. మరణించిన కార్యకర్తల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని సిఎం భరోసా ఇచ్చారు. తాము అండగా వుంటామని స్పష్టం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలందించాలని ఆదేశించారు.
బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం : కెటిఆర్
వైరా నియోజకవర్గంలోని కారేపల్లి మండలం చీమలపాడు వద్ద జరిగిన అగ్నిప్రమాద ఘటనపై బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదం ఘటనపై కెటిఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా బిఆర్‌ఎస్ నేతలతో, అధికారులతో కెటిఆర్ మాట్లాడారు. మృతుల కుటుంబాలు, క్షతగాత్రులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని కెటిఆర్ ఆదేశించారు.
బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి : హరీశ్‌రావు
కారేపల్లి అగ్నిప్రమాద ఘటనపై బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇద్దరు చనిపోవటం బాధాకరమని పేర్కొన్నారు. మృతులు, క్షతగాత్రుల గురించి మంత్రి ఆరా తీశారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో మాట్లాడి, అత్యున్నత వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే క్షతగాత్రులకు మెరుగైన చికిత్స కోసం అవసరమైతే నిమ్స్ తరలించాలని ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News