Sunday, April 28, 2024

అభాగ్యులకు అండగా సీఎం కేసీఆర్

- Advertisement -
- Advertisement -
  • ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్

సుబేదారి: అభాగ్యులకు అండగా సీఎం కేసీఆర్ నిలుస్తున్నారని, దివ్యాంగుల ధైర్యం బీఆర్‌ఎస్ ప్రభుత్వమని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. గురువారం హన్మకొండ కలెక్టరేట్‌లో దివ్యాంగులకు పెంచిన ఫించన్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. మనసున్న సీఎం కేసీఆర్ అని, దివ్యాంగుల సాధక బాధకాలు తెలిసే వారి పింఛన్ పెంచారన్నారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో దివ్యాంగులు ఎన్నో కష్టాలు అనుభవించే వారని, కనీసం పింఛన్ సైతం నోచుకోలేదన్నారు.

నాడు రూ. 500 పింఛన్ ఇస్తే నేడు రూ. 4016 ఇస్తున్నామన్నారు. నాడు దివ్యాంగులు ఆత్మ నూన్యతతో బతికితే నేడు ఆత్మ గౌరవంతో బతుకున్నారన్నారు. ప్రభుత్వ పథకాల్లో సైతం దివ్యాంగులకు ప్రత్యేక కోటాను తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ప్రత్యేకంగా హాస్టళ్లను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేస్తోందన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగులతో కలిసి భోజనం చేశారు. దివ్యాంగులకు ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కుడా ఛైర్మన్ సంగంరెడ్డి సుందర్‌రాజ్ యాదవ్, కలెక్టర్ సిక్తా పట్నాయక్, కమిషనక్ షేక్ రిజ్వాన్ భాషా, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News