Tuesday, April 30, 2024

మాజీ ఆర్బిఐ గవర్నర్ తో సిఎం రేవంత్, భట్టి సమావేశం… ఆర్థికపరిస్థితిపై చర్చ..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మాజీ ఆర్బిఐ గవర్నర్ రఘురామ్ రాజన్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఆదివారం ఉదయం జూబ్లీహిల్స్ లోని సీఎం క్యాంపు ఆఫీస్ లో రఘురామ్ రాజన్తో సీఎం రేవంత్ రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసన వ్యవహారాలు, ఐటీ శాఖల మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆర్థిక అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం కార్యదర్శి శేషాద్రి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News