Saturday, April 27, 2024

అర్హులైనవారందరికీ అండగా సిఎమ్‌ఆర్‌ఎఫ్

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట:అర్హులైన వారిందరికీ అండగా సిఎమ్‌ఆర్‌ఎఫ్ నిలుస్తుందని హుజూర్‌నగర్ నియోజకవర్గ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శుక్రవారం హుజూర్ నగర్ నియోజకవర్గం పరిధిలోని పలువురు లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన చెక్కులను హుజూర్‌నగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉ న్న వారందరినీ బిఆర్‌ఎస్ పధకాల ద్వారా ఆదుకోవడం జరుగుతుందని తెలిపారు. అలాగే నియోజకవర్గంలో కోట్లాదిరూపాయలతో అభివృద్ధి చేస్తూ ప్రజలకు మౌళికసదుపాయాల కల్పనకు కృషి చే యడం జరుగుతుందన్నారు. అర్హులైన ప్రతిఒక్కరూ ప్ర భుత్వ పధకాలు సద్వినియోగపర్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, బిఆర్‌ఎ స్ కార్య కర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News