Friday, May 3, 2024

అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన కలెక్టర్, ఎమ్మెల్యే

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ సిటీ: జిల్లా కేంద్రంలోని వినాయక్‌నగర్‌లో గల తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద గురువారం జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, మేయర్ దండు నీతూ కిరణ్, అదనపు కలెక్టర్ చిత్రామిశ్రాలు అమరులకు పూలదందలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో చివరి రోజుల్లో భాగంగా తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలను గుర్తు చేస్తూ అమరుల స్థూపానికి నివాళులర్పించామన్నారు.

లోకల్‌బాడీ సమావేశాలు నిర్వహించి గ్రామ, మండల, జిల్లా పరిషత్, మున్సిపల్ సమావేశాలలో ప్రత్యేక సమావేశం నిర్వహించి అమరుల త్యాగాలను స్మరించుకుంటామన్నారు. జిల్లాలోని పాఠశాలలో అమరులను స్మరిస్తూ వారి కుటుంబ సభ్యులకు పసన్మానించారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా మాట్లాడుతూ తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలు గత 21 రోజులుగా సాగుతున్నాయన్నారు. అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించామన్నారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ హైదరాబాద్‌లోని సెక్రెటేరియట్ ఎదుట అమరుల చిహ్నాన్ని ఏర్పాటు చేశామన్నారు. తొమ్మిది సంవత్సరాలలో తెలంగాణ సాధించుకున్న విజయాలకు గుర్తు చేసుకోవాలన్నారు. 2014కు ముందు ప్రస్తుతం తెలంగాణాలో జరిగిన అభివృద్ధిని గుర్తించాలన్నారు. దసరా, దీపావళి పండగల ఒకరోజు ముందు మాత్రమే వస్తుందని కానీ తెలంగాణ రాష్ట్ర దశాబ్ధి ఉత్సవాలు 22 రోజుల పాటు కొనసాగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో నుడా ఛైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, ఆర్డీఓ శ్రీనివాస్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News