Thursday, May 2, 2024

జిల్లా ఖజానా శాఖ స్ట్రాంగ్ రూమ్‌ను ప్రారంభించిన కలెక్టర్

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: ఖజానా శాఖ విభాగంలో ఫైల్‌లకు మంచి భద్రతతో కూడిన స్ట్ట్రాంగ్ రూమ్ నిర్మించినందుకు ఇంజనీరింగ్, ఖజానా శాఖ అధికారులను కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అభినందించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో జిల్లా ఖజనా శాఖ వారి స్ట్రాంగ్ రూమ్‌ను జిల్లా అదనపు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్ట్రాంగ్ గదిని ఆర్‌అండ్‌బి, ఇంజనీరింగ్ అధికారులు అదునాతన పద్ధ్దతిలో అత్యంత పకడ్బదిగా నిర్మించారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఖజానా శాఖ అధికారి జగదీష్ సింగ్, ఆర్‌అండ్ బి బిఈ రాము, ఖజానా శాఖ బృందం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News