Monday, May 6, 2024

ఆయిల్ పామ్ సాగులో వేగం పెంచి లక్ష్యాన్ని చేరేలా అధికారులు పనిచేయాలి

- Advertisement -
- Advertisement -
  • సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

సిద్దిపేట: ఆయిల్ పామ్ సాగులో వేగం పెంచి లక్ష్యాన్ని చేరేలా అధికారులు పని చేయాలని సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. గురువారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో వ్యవసాయ,ఉద్యానవన, ఆయిల్ ఫెడ్ కార్పోరేషన్, డ్రిప్ కంపెనీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకు సుమారు 2059 ఎకరాలు సేకరణ 600 ఎకరాల పైన మొక్కలు పెట్టడం పూర్తి చేశారని జిల్లా ఉద్యాన వన శాఖ అధికారి సునిత తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి హరీశ్‌రావు అదేశాల మేరకు అత్యంత లాభదాయకమైన పంట ఆయిల్ పామ్ సాగు జిల్లాలో వేగవంతం చేయాలన్నారు. వర్షాకాలం ప్రారంభమైందని రైతులు పంటలు వేసెలోపు వారితో మాట్లాడి ఆయిల్ పామ్ సాగు చేసేలా ప్రేరేపించాలన్నారు.

ఈ నెలలోనే సగం టార్గెట్ పూర్తి చేయాలన్నారు. ఎఈఓలు రైతుల ఇంటికి వెళ్లి ఆయిల్ ఫామ్ వల్ల కలిగే లాభాలు తెలిపి ప్రేరణ కల్పించాలన్నారు. ఆయిల్ పామ్ సాగులో దశలు రైతులను ఎంపిక చేయడం, డిడి కలెక్షన్లు, మార్కింగ్ ,డ్రిప్ ఫిట్టింగ్ మొక్కలు పెట్టడం అనే ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలన్నారు. ఏఓలు మీ మండలంలోని పనిలో వెనుకబడిన క్లస్టర్‌ను రోజువారి పర్యవేక్షణ చేయాలన్నారు. వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆకాల వడగండ్ల వర్షాల వల్ల వరి పంట నష్టాలను తెలుపుతూ పంటలో మార్పులు తీసుకొని ఆయిల్ పామ్ సాగు వల్ల వచ్చే లాభాలను తెలుపుతూ రైతులను ప్రోత్సహించాలన్నారు. పెద్ద భూ స్వాములనే కాకుండా చిన్న, సన్నకారు రైతులను కూడా ఆయిల్ పామ్ వైపు మళ్లించాలి.వ్యవసాయ శాఖ, ఉద్యావన శాఖ, ఆయిల్ ఫెడ్ కార్పోరేషన్ అధికారులు అందరు సమన్వయంతో పని చేయాలని అధికారులను అదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్, ఆయిల్ ఫెడ్ కార్పొరోషన్ మేనేజర్ సురేందర్ రెడ్డి, కార్పొరేషన్ ఇంచార్జి సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News