- Advertisement -
సూరత్: 18 ఏళ్ల కాలేజీ విద్యార్థినిపై దుండగులు అత్యాచారానికి పాల్పడి భవనం నుంచి కిందికి తోసివేసిన ఘటన గుజరాత్లోని సూరత్లో జరిగింది. బుధవారం రాత్రి జరిగిన సంఘటన గురించి పోలీసులు శుక్రవారం వెల్లడించారు. సూరత్లోని పార్లే పాయింట్ ప్రాంతంలోని ఐదంతస్థుల భవనం ఎదుట రోడ్డుపై బాధితురాలు అపస్మారక స్థితిలో ఉండగా స్థానికులొకరు పోలీసులకు ఫోన్ చేసి తెలియజేశారు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు. బాధితురాలు నగరంలోని గోదాధర ప్రాంతానికి చెందిన టెంపో డ్రైవర్ కూతురిగా గుర్తించారు.
- Advertisement -