- Advertisement -
ముంబై : నియంతృత్వ మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ప్రత్యామ్నాయంగా ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం కావాలని, యుపిఎకు నాయకత్వం వహించడానికి దేశంలో నాయకుల కొరత లేదని శివసేన ఎంపి సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యపై కాంగ్రెస్ ప్రతిస్పందించింది. మహారాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ చవాన్ దీనిపై మాట్లాడుతూ యుపిఎ నాయకత్వం విషయంలో శివసేన వ్యాఖ్యానించడం సరైన విధానం కాదని పేర్కొన్నారు. శివసేన యుపిఎలో ఇంకా భాగం కాలేదని, శివసేనతో కాంగ్రెస్ పొత్తు కేవలం మహారాష్ట్ర రాజకీయాలకే పరిమితమని పేర్కొన్నారు.
- Advertisement -