Wednesday, May 8, 2024

సిఎంతో బేటీ…. కాంగ్రెస్ ఎంఎల్‌ఎకు కరోనా

- Advertisement -
- Advertisement -

Congress MLA

గాంధీనగర్: కాంగ్రెస్ ఎంఎల్‌ఎ ఇమ్రాన్ ఖేద్వాలాకు కరోనా వైరస్ సోకిన సంఘటన గుజరాత్‌లో జరిగింది. జమాల్‌పూర్ ఖాదియా నియోజక వర్గం నుంచి ఇమ్రాన్ గెలుపొందారు. మంగళవారం ఇద్దరు కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రుపానీతో సమావేశమయ్యారు. అదే రాత్రి ఇమ్రాన్‌కు కరోనా పాజిటీవ్ రావడంతో రాష్ట్ర ఉన్నతాధికారులు ఉలిక్కిపడ్డారు. ఈ సమావేశంలో మంత్రులు, ఎంఎల్‌ఎలు సామాజిక దూరం పాటించారన్నారు. మాస్కులు తీసేసి సమావేశంలో పాల్గొన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గుజరాత్ కరోనా రోగుల సంఖ్య 650కు చేరుకోగా 28 మంది మృత్యువాతపడ్డారు. భారత్ దేశంలో కరోనా వైరస్ 11,510 మందికి సోకగా 394 మంది చనిపోయారు. తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 644కు చేరుకోగా 18 మందిమరణించారు.

 

Congress MLA who met CM tests coronavirus positive
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News