Sunday, April 28, 2024

భార్యాపిల్లలను చంపి… కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకొని

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఓ కానిస్టేబుల్ తన భార్య, ఇద్దరు పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడపలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కడప జిల్లా కేంద్రంలోని కోపరేటివ్ కాలనీలో కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు నివాసం ఉంటూ రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్నాడు. కుటుంబంలో కలహాలు చెలరేగడంతో భార్య, ఇద్దరు పిల్లలను చంపాడు. అనంతరం వెంకటేశ్వర్లు తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: నేడు మెగా డెయిరీ ప్రారంభం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News