Sunday, April 28, 2024

ఓయూలో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల విన్నూత నిరసన

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తమను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ ఓయూ ఆర్ట్ కళాశాల ముందు కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు నిరసన వ్యక్తం చేశారు. శనివారం తమ సర్వీసులను రెగ్యులరైజ్ చేయాలని సూచించే ప్లకార్డులను ప్రదర్శించారు. ఈసందర్భంగా కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల జేఏసీ కన్వీనర్ డాక్టర్ డి ధర్మతేజ మాట్లాడుతూ గత రెండు మాసాలుగా వివిధ రూపాల్లో తాము ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం సరికాదన్నారు. ఇప్పటికైనా వెంటనే తమ క్రమబద్దీకరణపై ప్రకటన చేసి తగిన ప్రక్రియను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. లేనిపక్షంలో తమ ఉద్యమాన్ని ఉదృతం చేసి తరగతులు బహిష్కరించి నిరవధిక సమ్మెకు దిగుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఓయూ వివిధ కళాశాలలకు చెందిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు అయోధ్య కవితా రెడ్డి, వినీత పాండే, దీకొండ తిరుపతి, విజయ్, మోడెం రవి, శంషుద్దీన్, ఆరూరి మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News