Tuesday, May 7, 2024

ప్రజల చైతన్యంతోనే సైబర్ నేరాల నియంత్రణ

- Advertisement -
- Advertisement -
  • జిల్లా ఎస్‌పి పుల్లా కరుణాకర్

జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రతినిధి: సైబర్ నేరాలు రోజు రోజుకు పెరుగుతున్నాయని, టెక్నాలజీ వాడుకొని నేరగాళ్లు ప్రజల డబ్బులను దోచుకుంటున్నారని, అనవసర లింకులు క్లిక్ చేయోద్దని, ఓటిపి, పాస్‌వర్డ్‌లు ఎవరికి చెప్పద్దని, జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్‌పి పుల్లా కరుణాకర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అపరిచిత వ్యక్తులతో ఫోన్ కాల్స్, వాట్సాప్, ఫేస్‌బుక్ చాటింగ్‌కు దూరంగా ఉండాలని ఓటిపి ఎవరికి చెప్పద్దని సూచించారు.

లాటరీలు, రివార్డులు, జాబ్స్, కమిషన్లు, డిస్కౌంట్‌ల పేరుతో సులభంగా డబ్బు సంపాదించుకోవచ్చని ప్రజలకు ఆశ చూపిస్తారని, బ్యాంక్ నుండి మాట్లాడుతున్నామని ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, మొబైల్‌కు వచ్చిన ఓటిపి, ఏటిఎం పనిచేయడం లేదని, కారు గెలుచుకున్నారని, డబ్బు రెట్టింపు అవుతుందని, మనీ ఇన్వెస్టిమెంట్ పేరుతో క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని, ఇలా రకరకాలుగా సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసగిస్తున్నారని ఎస్‌పి పేర్కొన్నారు.

సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన ప్రజలు వెంటనే 1930 టోల్‌ఫ్రీ నెంబర్, లేదా డయల్ 100కు కాల్ చేసి వచ్చే అవకాశం ఉందని ఎస్‌పి కరుణాకర్ వివరించారు. సైబర్ నేరాలను నివారించే క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజల చైతన్యమే సైబర్ నేరాల నివారణకు ఉపయోగపడుతుందని, సామాజిక మాధ్యమాల ద్వారా వ్యక్తిగత వివరాలు ఇతరులతో పంచు కోకూడదని ఈ విషయంలో ప్రజలు అవగాహనతో ఉండాలని ఎస్‌పి వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News