- Advertisement -
ఢిల్లీ: భారత్ దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 47,638 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 670 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా కేసుల సంఖ్య 84.11 లక్షలకు చేరుకోగా 1.25 లక్షల మంది చనిపోయారు. కరోనా వ్యాధి నుంచి 77.65 లక్షల మంది కోలుకోగా 5.2 లక్షల మంది చికిత్స పొందుతున్నారు. చలికాలంలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. చలికి వైరస్ ఎక్కువ కాలం బతికి అవకాశం ఉందని తెలియజేశారు.
- Advertisement -