Saturday, May 18, 2024

కాకినాడలో కార్పొరేటర్ హత్య

- Advertisement -
- Advertisement -

Corporator ramesh murder in kakinada

 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాలో కార్పొరేటర్ ను హత్య చేశారు. కాకినాడ కార్పొరేటర్ కంపర రమేష్ ను కారుతో ఢీకొట్టి హత్య చేశారు. కాకినాడలోని వాకపూడ గానుగచెట్టు సెంటర్ లో కారు వాష్ షెడ్ సమీపంలో అతడి మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రమేష్ హత్యకు ముందకు కారు షెడ్ లో స్నేహితులతో కలిసి మద్యం తాగాడు. అనంతరం అందరు ఇళ్లకు వెళ్లిపోయారు. ఆ సమయంలోనే అతడు హత్యకు గురయ్యాడు. పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాత కక్ష్యల నేపథ్యంలో హత్య జరిగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహాన్ని కాకినాడ ట్రస్ట్ ఆస్పత్రికి తరలించారు. సిసి కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News