- Advertisement -
భువనేశ్వర్: యువ జంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఒడిశా రాష్ట్రం మయుర్భంజ్ ప్రాంతం ధనసుల్ గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బౌలా సింగ్(20), సిమా సింగ్(18) అనే యువ జంట చెట్టుకు ఉరేసుకున్నారు. వారి మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరిని ఎవరైనా హత్య చేసి చెట్టుకు వేలాడదీశారా? లేకి ప్రేమ వ్యవహారమా? అని కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువతి, యువకుడు బంధువులను పిలిపించి మాట్లాడగా తాము షాక్ లో ఉన్నామని వారి తెలిపారు. దేవుళ్ల ఫోటోలు చెట్టు కింద ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
- Advertisement -