Sunday, April 28, 2024

జనగామలో పురుగుల మందు తాగి దంపతుల ఆత్మహత్యాయత్నం..

- Advertisement -
- Advertisement -

జనగామ జిల్లాలో దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గురు, సునీత అనే భార్యభర్తలు ఇద్దరు సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగుతూ ఆత్మహత్యకు యత్నించారు. గమనించిన స్థానికులు వెంటనే భార్యభర్తులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన జిల్లాలోని నర్మెట్ట మండలంలోని సూర్యబండ తండాలో చోటుచేసుకుంది. తమ భూమిని కొందరు దళారులు ఆక్రమించారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని ఆవేదనతో దంపతులు ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News