- Advertisement -
మరో రెండు గంటలు పొడిగింపు
అహ్మదాబాద్: రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులను కట్టడి చేయడానికి ప్రధాన నగరాల్లో రాత్రిపూట కర్ఫ్యూను బుధవారంనుంచి రెండు గంటలు పొడిగించాలని గుజరాత్ ప్రభుత్వం మంగళవారం నిర్ణయించింది. మార్చి17నుంచి 31 దాకా అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్కోట్ నగరాల్లో రాత్రి 10 గంటలనుంచి ఉదయం 6 గంటల వరకు అమలులో ఉంటుందని ఒక అధికార ప్రకటన తెలిపింది. ఇంతకు ముందు రాత్రి పూట కర్ఫ్యూ అర్ధరాత్రి 12నుంచి ఉదయం 6 వరకు అమలులో ఉండేది. మంగళవారం జరిగిన ముఖ్యమంత్రి విజయ్ రూపానీ నేతృత్యంలోని కరోనా వైరస్ టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కరోనా కేసులు పురుగుతున్న దృష్టా రాత్రి 10గంటలనుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫూ విధించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది అని రాష్ట్రప్రభుత్వం ఆ ప్రకటనలో తెలిపింది.
COVID-19 Night curfew in Gujarat cities
- Advertisement -