Monday, April 29, 2024

టీమిండియాకు షాక్.. రాహుల్, రోహిత్, ఇషాన్ ఔట్

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్ లో టీమిండియా మూడు కీలక వికెట్లు కోల్పోయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు మరోసారి ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ కెఎల్ రాహుల్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషాన్ తో కలిసి మరో ఓపెనర్ రోహిత్ భారీ షాట్లకు పోకుండా జాగ్రత్తగా ఆడాడు.అయితే, వరుస ఓవర్లలో రోహిత్, కిషాన్ లు పెవిలియన్ చేరారు. దీంతో భారత్ 24 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. ప్రస్తుతం భారత్ 6 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 24 పరుగలు చేసింది. క్రీజులో కెప్టెన్ విరాట్ కోహ్లీ(4), రిషబ్ పంత్(0)లు ఉన్నారు.

IND vs ENG 3rd T20: Rohit and Kishan wickets down

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News