Wednesday, May 8, 2024

కానిస్టేబుళ్లు సస్పెన్షన్.. ఇన్స్‌స్పెక్టర్‌కు మెమో జారీ

- Advertisement -
- Advertisement -

CP Anjani Kumar

 

మనతెలంగాణ, హైదరాబాద్ : నిత్యావసర వస్తువులు మార్కెట్‌కు తీసుకువచ్చిన వాహనదారుడి నుంచి లంచం తీసుకున్న ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుళ్లు పంచ ముఖేష్, సురేష్ మోజంజాహీ మార్కెట్‌కు నిత్యావసరాలు తీసుకువచ్చిన ఆటోను ఆపి డ్రైవర్ వద్ద నుంచి డబ్బులు తీసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అఫ్జల్ గంజ్ ఇన్స్‌స్పెక్టర్‌కు మెమో జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News