Sunday, May 12, 2024

ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలి: సబితా

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: సీజనల్ వ్యాధుల నివారణ చర్యలో భాగంగా ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 10 నిమిషాల పాటు ప్రజలు తమ ఇండ్లను, పరిసరాలను శుభ్రపరుచుకోవాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. ఈ సందర్భంగా సబితా మీడియాతో మాట్లాడారు. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రజలకు అవగాహన కల్పించేందుకు క్యాంపెయిన్ నిర్వహించాలన్నారు. దోమలు పెరగకుండా చర్యలు తీసుకోవాలని, పారిశుద్ధ్య కార్మికులను గౌరవించడం మన బాధ్యత అని, శానిటైజేషన్ విషయంలో తెలంగాణకు మంచి పేరు ఉందని, కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని సబితా  సూచించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News