Wednesday, May 8, 2024

పని ఆశ చూపి 19 హత్యలు

- Advertisement -
- Advertisement -

ఒంటిమీద బంగారం ఉన్న కూలీ మహిళలే లక్ష్యం
మంచి మాటలతో తమ ఇంటి వద్ద పని ఉందని చెప్పి జిన్నారం అడవుల్లోకి తీసుకెళ్లి హతమార్చిన దంపతులు
ఒక మిస్సింగ్ ఫిర్యాదుతో బయటపడిన దారుణమైన గొలుసు హత్యలు
 8 హత్యలు చేసిన భర్త స్వామి, 11 మందిని హతమార్చిన భార్య నర్సమ్మ
బండరాళ్లతో మోది కడతేర్చిన దంపతులు

మన తెలంగాణ/హైదరాబాద్: దుండిగల్‌లో 19 మంది మహిళలను మోసగించి దారుణంగా హత్య చేసిన కేసులో నర్సమ్మ, స్వామి దంపతులను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక మిస్సింగ్ ఫిర్యాదుపై పోలీసుల దర్యాప్తు క్రమంలో హత్యల సమాచారం బయటపడింది. దంపతులు నర్సమ్మ(26), స్వామి(27)లను పోలీసులు నిర్బంధంలోకి తీసుకుని విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భార్యాభర్తలిద్దరూ బంగారం కోసం 19మంది మహిళలను కడతేర్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈక్రమంలో భర్త స్వామి 8 హత్యలు చేయగా, భార్య నర్సమ్మ 11 హత్యలు వెరసి 19 హత్యలు చేసినట్లు నిందితులు పోలీసుల విచారణలో అంగీకరించారు. మహిళల వంటిపై ఉన్న నగల కోసం నమ్మకంగా నటించి దంపతులు నర్సమ్మ, స్వామిలు ఏకంగా 19 మంది మహిళలను చంపేశారని మృతుల వివరాలను సేకరించే నిమిత్తం ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం మాదారం గ్రామానికి చెందిన స్వామి(27) ఈనెల 25న మల్లంపేటలోని కూలీల అడ్డా నుండి భామిని(35)అనే మహిళను జిన్నారం అడవుల్లోకి తీసుకెళ్లాడు. అక్కడ భార్య నర్సమ్మతో కలిసి ఆమెను హత్య చేశాడు. ఈ నేపథ్యంలో భామిని కనిపించడంల లేదని ఫిర్యాదు నమోదు కావడంతో స్వామిపై అనుమానంతో అదుపులోకి తీసుకోని పోలీసులు తమదైన శైలిలో విచారించారు. దీంతో మాదారం గుట్టలల్లో పడవేసిన భామిని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. కేవలం మహిళల వంటిపై బంగారం మీద మోజుతో వీరందిరినీ కడతేర్చామని దంపతులు పోలీసులకు వెల్లడించారు.తొలుల మహిళల వంటిపై ఉన్న బంగారం, వెండి వస్తువులను పసిగట్టి ఆపై వారిని నమ్మించి సదరు దంపతులు అడవుల్లోకి తీసుకెళ్లి వారిని హత్య చేస్తున్నట్లు విచారణలో నిందితులు ఒప్పకున్నట్లు పోలీసులు తెలిపారు.
నమ్మకంగా నటించి..
ఒంటిపై బంగారం ఉన్న కూలీలను గుర్తించి వారితో నమ్మకంగా ఉంటూ మాయమాటలు చెప్తారు. అనంతరం తమ ఇంటివద్ద పని ఉందంటూ తీసుకువెళతారు. ఇలా సంగారెడ్డి జిల్లా జిన్నారం అడవుల్లోకి తీసుకువెళ్లి హత్య చేయడం..నగలు దోచుకోవడం వారికి అలవాటుగా మారినట్టు పోలీసులు వివరించారు. కాగా రాత్రి, పగలు తేడాలేకుండా ఒంటరిగా వెళ్తున్న మహిళలు కనిపిస్తే వాళ్ళే వారి ని పరిచయం చేసుకుని యమాటలు చెప్పి, చిన్నగా వాళ్ళని ముగ్గులోకి దించి. వారిని నమ్మించి నేరుగా జిన్నారం అడవుల్లోకి తీసుకెళ్లి వారి వంటిపై ఉన్న బంగారం లాక్కొని కిరాతకంగా హత్యచేస్తారని, త్వరలో ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను తెలుపుతామని పోలీసులు తెలిపారు
అడ్డా కూలీలే లక్షంగా ..
వరుస హత్యలకు పాల్పడిన దంపతులు నర్సమ్మ,స్వామిలు అడ్డా కూలీలనే లక్షంగా చేసుకుంటారని, ఈక్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం చంద్రతండాకు చెందిన భామిని అనే 39 సంవత్సరాల మహిళ అడ్డకూలీగా పని చేస్తున్న క్రమంలోనే ఇద్దరు భార్యభర్తలు ఈనెల 25న కూలీ పని ఉందంటూ తీసుకువెళ్లారని పోలీసులు వివరించారు. అనంతరం ఆమెను జిన్నారం మండలం మాదారం గ్రామపంచాయితీ మంత్రికుంట శివారు అటవీ ప్రాంతంలో బండరాళ్ల మోది హత్య చేసి పడేశారు.ఆమెపై ఉన్న బంగారు నగలు ఎత్తుకెళ్లారు. చివరికి ఆమెపై ఆత్యాచారం కూడా చేసినట్టు పోలీసులు తెలిపారు.
అనుమానం రాకుండా హత్యలు
నగల కోసం వరుస హత్యలకు పాల్పడిన దంపతులు ఎవరికీ అనుమానం రాకుండా వ్యవహరిస్తారని, ముఖ్యంగా మహిళలను ఆకట్టుకునే సమయంలో భార్యభర్తలు వేరువేరుగా ఉంటూ నటిస్తారని తెలిపారు. ఒకరికి ఒకరు పరిచయం లేనట్లుగా నటించి నగల కోసం హత్యమారుస్తారని విచారణలో తేలింది. ఇటీవల కాలంలో మిస్సింగ్ కేసులు నమోదు కావడంతో వరుస హత్యలు చేస్తున్న దంపతులపై పక్కా సమాచారం అందుకున్న దుండిగల్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అనంతరం నర్సమ్మ,స్వామిలను వేర్వేరుగా పోలీసులు విచారించారు. దీంతో భార్య భర్తలు ఇద్దరు కలిసి 19 హత్యలు చేసినట్టు పోలీసులు విచారణలో తేలింది.
Criminal couple Arrested for 19 murders in Dundigal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News