Thursday, May 2, 2024

నక్సలైట్‌కు సిఆర్‌పిఎఫ్ జవాన్ల రక్తదానం

- Advertisement -
- Advertisement -

CRPF Jawans donated blood to Naxalite

 

న్యూఢిల్లీ : జార్ఖండ్‌లో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో గాయపడ్డ నక్సలైట్‌కు తమ జవాన్లు రక్తదానం చేశారని సిఆర్‌పిఎఫ్ అధికారులు తెలిపారు. గురువారం వెస్ట్ సింగ్‌భూమ్ జిల్లా మన్మార్‌తేబో అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు నక్సలైట్లు చనిపోగా, ఇద్దరిని పట్టుకున్నామని అధికారులు తెలిపారు. పట్టుబడినవారిలో తీవ్రంగా గాయపడిన మనోజ్ హెస్సా అనే మావోయిస్ట్‌ను టాటానగర్ హాస్పిటల్‌లో చేర్చారు. రక్తం అవసరమని వైద్యులు తెలుపగా, ఓంప్రకాశ్ యాదవ్(36), సందీప్‌కుమార్(30) అనే జవాన్లు రక్తదానం చేశారని అధికారులు తెలిపారు. చనిపోయిన నక్సలైట్ల నుంచి ఒక ఎకె47, మరో 303 రైఫిల్ స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News