- Advertisement -
రిక్టర్ స్కేలుపై 4.7 పాయింట్లుగా నమోదు
రోహ్తక్ వద్ద భూకంప కేంద్రం గుర్తింపు
న్యూఢిల్లీ: తూర్పు హర్యానా, ఢిల్లీ ఎన్సిఆర్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఓ మోస్తరు తీవ్రతతో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 4.7 పాయింట్ల తీవ్రత ఉన్న ఈ భూకంపం రాత్రి 9 గంటల 8 సెకన్లకు సంభవించింది. భూకంపం కేంద్రం హర్యానాలోని రోహ్తక్లో ఉన్నట్లు, భూమి లోపల 3.3 కిలోమీటర్ల లోతులో ఇది ఉన్నట్లు గుర్తించారు. ఎన్సిఆర్, ఢిల్లీ, రోహ్తక్, జింద్ సోనేపట్ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి తీవ్రంగా కంపించగా, చండీగడ్, పంజాబ్ ప్రాంతాల్లో దీని తీవ్రత తక్కువగా ఉంది. అయితే ప్రాథమిక సమారాన్ని బట్టి ఎక్కడా ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించినట్లు వార్తలు రాలేదు.
- Advertisement -