Sunday, April 28, 2024

కొండపోచమ్మ సాగర్‌లో హైదరాబాద్ విద్యార్థి మృతదేహం

- Advertisement -
- Advertisement -
  • నిండు ప్రాణం తీసిన ఈత సరదా

గజ్వేల్: ఈత కొట్టాలన్న సరదా నిండుప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటన మృతుని కుటుంబంలో విషాదాన్ని నింపింది. హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి మండలం మియాపూర్ న్యూ అఫీజ్ పేట ఆదిత్య నగర్ కాలనీకి చెందిన ఎండి అబ్దుల్ హాసిబ్ (20) అనే విద్యార్థి మృతదేహం శనివారం సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌లో తేలింది. ములుగు పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించి శవ పరీక్షకుగాను గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ములుగు ఎస్‌ఐ రంగక్రిష్ణ తెలిపిన వివరాల మేరకు.. మృతుడు అబ్దుల్ హసీబ్ తన స్నేహితులతో కలిసి శుక్రవారం సాయంత్రం మర్కుక్ మండలం కొండపోచమ్మ సాగర్‌కు వచ్చారు. అక్కడ కొంతసేపు గడిపిన వారు సరదాగా సుమారు 5 గంటల ప్రాంతంలో ఈత కోసం సాగర్‌లో దిగారు. ప్రమాదవశాత్తు లోతైన ప్రాంతంలో మునిగిన అబ్దుల్ వాసిబ్ మృతి చెందాడు. మృతుని మిత్రుల ద్వారా సమాచారం అందుకున్న మృతుని తండ్రి ఖామిల్ పాషా , బంధువులు శనివారం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ములుగు పోలీసులకు మృతుని తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో రిజర్వాయర్‌లో గాలింపు చర్యలు చేపట్టగా అబ్ధుల్ హాసిబ్ మృతదేహం దొరికింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించామని ములుగు ఎస్‌ఐ రంగక్రిష్ణ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News