Wednesday, May 1, 2024

గ్రూపు-1 గడువు పొడిగింపు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: గ్రూప్ -1 ఉద్యోగ నియామక పరీక్షలకు దరఖాస్తుల గడువును ఈనెల 16వ తేదీ వరకు టిఎస్‌పిఎస్సీ పొడిగించింది. దరఖాస్తుల గడువు గురువారంతో ముగియనుండగా అభ్యర్థులకు మరో రెండు రోజుల పాటు అవకాశం కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి గత నెల 19వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 23 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తోంది. బుధవారం వరకు 2.7 లక్షలకు పైగా దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. దీంతో దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, పరీక్షను జూన్ 9వ తేదీన మెయిన్స్ అక్టోబర్ 21వ తేదీ నుంచి నిర్వహించనుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News