Wednesday, May 1, 2024

డిసెంబర్ 9 తెలంగాణకు చరిత్రాత్మకమైన రోజు

- Advertisement -
- Advertisement -

అమరవీరుల స్థూపం నివాళులు, ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన జిహెచ్ఎంసి మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, టిఆర్ఎస్ వి విద్యార్థి ఉద్యమ నాయకులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కెసిఆర్ సచ్చుడో తెలంగాణ రాష్ట్రం వచ్చుడో అనే నినాదంతో నవంబర్29న కెసిఆర్ ఆమరణ నిరాహారదీక్ష  చేపట్టారు. కెసిఆర్ దీక్ష ఫలితంగా అప్పటి యుపిఎ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల పోరాటానికి దిగి వచ్చి డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించింది. కెసిఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను విరమించాలని అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటించిన రోజు డిసెంబర్ 9 అని దానికి ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సాధించడం జరిగిందని అందుకే  ఆరోజును గుర్తు చేసుకుంటూ గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపనికి జిహెచ్ఎంసి మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, బిసి కమిషన్ సభ్యుడు కిషోర్ గౌడ్ నివాళులర్పించడంతో పాటు సిఎం కెసిఆర్ చిత్ర పటానికి విద్యార్థి ఉద్యమ నాయకులతో కలిసి పాలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా బాబా ఫసియుద్దీన్ మాట్లాడారు.  2009 నవంబర్ 29న తెలంగాణ వచ్చుడో కెసిఆర్ సచ్చుడో అనే ఉద్యమ నినాదంతో ఆమరణ నిరాహార దీక్షకు పూనుకోవడం జరిగిందని దాని ఫలితంగానే డిసెంబర్ 9 తెలంగాణ ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర తెలంగాణ ప్రకటన చేయడం జరిగింది.

కానీ వచ్చిన తెలంగాణ ను ఆపడానికి అప్పటి ఆంధ్ర పాలకులు ఎన్నో కుట్రలు చేసిన అప్పటి యుపిఎ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగిందన్నారు. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు పోతుంటే సహకరించాల్సిన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన హక్కులకు అడ్డుపడుతూ సవతి తల్లి ప్రేమను చూపిస్తుందని మండిపడ్డారు.

ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకొని రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు. లేని పక్షంలో ఆనాడు కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాదించామో అదే ఉద్యమ స్ఫూర్తితో నేడు కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం మెడలు వంచి సిఎం కెసిఆర్ నాయకత్వంలో మా న్యాయమైన హక్కులు సాదించికుంటామన్నారు.

 బిజెపి పార్టీలో చేరిన తీన్మార్ మల్లన్న అవాకులు చవాకులు మాట్లాడుతున్నాడని అసలు ఉద్యమంలో మల్లన్న పాత్ర ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి కెసిఆర్ పై కానీ, కెటిఆర్ పైన గాని వారి కుటుంబ సభ్యులపై కానీ అనుచితమైన వ్యాఖ్యలు చేసే చూస్తూ ఊరుకోమని టిఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ అని ఉద్యమకారులు నిన్ను తరిమి తరిమి కొడతారని హెచ్చరించారు.

బిసి కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్ మాట్లాడారు.

సిఎం కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగానే డిసెంబర్ 9 రోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగిందన్నారు. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం లో ఎస్సి, ఎస్టి, బిసి, మైనార్టీల అభివృద్ధికి సిఎం కెసిఆర్ పెద్దపీట వేస్తున్నారని కొనియాడారు.  ఇప్పటికే దాదాపు 1000 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి నాణ్యమైన ఉచిత విద్యను అందించిన ఘనత సిఎం కెసిఆర్ కే దక్కుతుందన్నారు. ఎలాంటి రాజకీయ నేపథ్యంలేని మాలాంటి విద్యార్థి నాయకులకు ఉన్నతమైన పదవులు కట్టబెట్టడం కేవలం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు దక్కుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో శాట్ చైర్మన్ అల్లిపూర్ వెంకటేశ్వర్ రెడ్డి, టిఆర్ఎస్వి విద్యార్థి నాయకులు వినీత్ కుమార్, మేకల రవి, శ్రీకాంత్, అనిల్, ప్రణిత్, కృష్ణ, నవీన్, ఇలియాస్, జహీర్, పాండు, మధుకర్, సతీష్, సన్నీ, ముఖేష్ , అబ్బు, లడ్డు, జంగయ్య, అవినాష్, అఖిల్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నరసింహ ముదిరాజ్, గోషామహల్ మహేందర్ పరమేశ్వరి సింగ్ పెద్ద ఎత్తున విద్యార్థులు ఉద్యమ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News