Sunday, April 28, 2024

అగ్నిప్రమాదంలో ఆరుగురు సజీవదహనం

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పితంపూరంలోని ఓ భవనంలో మంటలు చెలరేగడంతో ఆరుగురు సజీవదహనమయ్యారు. మృతులు నలుగురు మహిళలు ఉండడంతో పాటు రెండు కుటుంబాలకు చెందిన సభ్యులుగా గుతర్తించారు. గురువారం రాత్రి ఇంట్లో నుంచి పొగలు కమ్ముకున్నాయి, పొగలకు అగ్నికీలలు తోడు కావడంతో ఆరుగురు కాలి బూడిదగా మారారు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. మృతదేహాలను బయటకు తీసి శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. షార్ట్ సర్కూట్‌తోనే ఈ ప్రమాదం జరిగింది ఉంటుందని అగ్నిమాపక సిబ్బంది అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News