Sunday, May 5, 2024

టి హబ్‌ను సందర్శించిన కిర్గిస్తాన్ ఉప ప్రధాని

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  కిర్గిస్థాన్ ఉప ప్రధాన మంత్రి, ఎడిల్ బైసలోవ్ తన హైదరాబాదు పర్యటనలో భాగంగా ఆదివారం టి హబ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఐటి,పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్,టి హబ్ సిఇఒ శ్రీనివాసరావు, తెలంగాణ అకాడమి ఫర్ స్కిల్ నాలెడ్జ్ ( టాస్క్ )సిఇవొ మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన టి హబ్‌లో ద్వారా జరుగుతున్న పలు కార్యక్రమాలను ప్రవర్ పాయింట్ ప్రజంటేషన్‌ద్వారా వివరించారు.అంతకు ముందు కిర్తిస్తాన్ ఉప ప్రధాన మంత్రి ఎడిల్ బైసలోవ్ మహేశ్వరంలోని ప్రతిష్టాత్మ కమైన మ్యాక్ కెనడియన్ సస్టెయినబుల్ వుడ్ విల్లాను సందర్శించారు. పర్యావరణహిత వుడ్ హౌస్‌ల కమ్యూనిటీని అభివృద్ధి చేయడంలో మ్యాక్ ప్రాజెక్ట్‌ల సహకారంపై ఆయన తన ఆసక్తిని చూపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News