Sunday, April 28, 2024

నా కథను నమ్మిన వారితోనే సినిమాలు చేస్తా

- Advertisement -
- Advertisement -

‘పలాస 1978’తో క్రేజీ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న కరుణ కుమార్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. సుధీర్ బాబు హీరోగా విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డిలు నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని శుక్రవారం ప్రపంచ వ్యాప్తం గా విడుదలకానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ “ఒక సోడా సెంటర్ యజమాని కూతురు హీరోయిన్. హీరో ఎలక్ట్రీషియన్. వీరి మద్యన చిగురించిన ప్రేమే ఈ ‘శ్రీదేవి సోడా సెంటర్’. ఆ తర్వాత ప్రేమ తాలూకు పర్యవసనాలు, దాని వెనుక ఉండే సాంఘిక, సామాజిక, ఆర్థిక పరమైన ఇబ్బందుల మధ్య వాళ్ళు ఏమయ్యారు? అనేది ఈ సినిమా కథ. హీరో సుధీర్ బాబుకు నా దగ్గరున్న రెండు కథలు చెప్పాను. వాటిలో ఒకటి శ్రీదేవి సోడా సెంటర్. ఈ కథ నచ్చి ఈ సినిమా చేయడానికి ఆయన ముందుకు వచ్చాడు. సినిమా అద్భుతంగా వచ్చింది. ఇక నేను రాసుకున్న కథలన్నింట్లో కూడా కథే హీరో. నన్ను, నా కథను నమ్మిన వారితోనే నేను సినిమాలు చేస్తాను. మణిశర్మ ఈ సినిమాకు అద్భుతమైన పాటలు ఇచ్చారు. మా సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను”అని అన్నారు.

Director Karuna Kumar about ‘Sridevi Soda Center’

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News