Sunday, May 5, 2024

‘సెక్రటేరియట్, అసెంబ్లీ అమ్మి అయినా దళితబంధు’ అందరికీ ఇవ్వాలి

- Advertisement -
- Advertisement -

Dalit Bandhu should be given to all:Revanth

సెక్రటేరియేట్, అసెంబ్లీ అమ్మైనా సరే
దళిత బంధు అందరికీ ఇవ్వాల్సిందే
మూడు చింతలపల్లిలో 48 గంటల
దళిత, గిరిజన ఆత్మ గౌరవ దీక్ష ముగింపు సభలో రేవంత్ డిమాండ్

మన తెలంగాణ/హైదరాబాద్ : దళిత బంధు అందరికీ ఇవ్వాలన్నదే తమ డిమాండ్ అని.. బడ్జెట్ సరిపోకపోతే సెక్రటేరియేట్, అసెంబ్లీ అమ్ముదం.. ఎక్కడ సంతకం పెట్టాలో చెప్తు పెడ్తామని టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. బుధవారం మూడు చింతలపల్లిలో 48 గంటల దళిత, గిరిజన ఆత్మ గౌరవ దీక్ష ముగింపు సభలో రేవంత్ మాట్లాడారు. తాను మంగళవారం రాత్రి బస చేసిన ఇల్లు ఇందిరమ్మ కాలానిదన్నారు. మూడు చింతలపల్లిలో ప్రజలు వ్యవసాయం మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నారని రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం దత్తత తీసుకున్న గ్రామంలో పేదలకు ఇచ్చిన హామీల ఇప్పటివరకు నెరవేర్చలేదని విమర్శించారు. నాలుగేళ్ల క్రితం గ్రామంలో పేదలందరికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వం దత్తత తీసుకున్న గ్రామానికి ఇచ్చిన అన్ని హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా? అని రేవంత్ ప్రశ్నించారు.

హామీలు పూర్తి చేసి ఉంటే బొడ్డురాయి దగ్గరే చర్చ పెడదామన్నారు. హామీలు పూర్తి చేసినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాసి ఎంపి పదవికి రాజీనామా చేస్తానని రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. దళిత బంధు కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీస్తుందని రేవంత్ అన్నారు. రాష్ట్రంలోని దళితులకు, గిరిజనులకు దళిత బంధు అమలు చేయాలని తెలిపారు. ఈ పోరాటం ఇప్పుడే ఆగదని, ప్రతి దళితులకు న్యాయం జరిగేంతవరకూ పోరాటం సాగుతుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తొలి సంతకం దళిత, ఆదివాసి, గిరిజన సంక్షేమం కోసం అత్యధిక బడ్జెట్ కేటాయించేలా చొరవ తీసుకుంటానని రేవంత్ హామీనిచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి ఎవరైనా సరే పార్టీ పరంగా అధ్యక్షుడే నెంబర్ వన్ అని స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్షుడిగా మాట ఇస్తున్నానని రేవంత్ తేల్చి చెప్పారు.

మంత్రి మల్లారెడ్డిపై రేవంత్ సంచలన ఆరోపణలు

మంత్రి మల్లారెడ్డికి యూనివర్సిటీ ఇచ్చిన భూమిపై రేవంత్ సంచలన ఆరోపణలు చేశారు. తప్పుడు పత్రాలతో మల్లారెడ్డి వర్సిటీకి అనుమతి తెచ్చుకున్నారని తెలిపారు. మల్లారెడ్డి అక్రమాలపై ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మల్లారెడ్డి నిర్దోషి అని తేలితే తాను ఏ శిక్షకైనా సిద్ధమని రేవంత్ ప్రకటించారు.

రేవంత్ దీక్ష విరమణ

మూడు చింతలపల్లిలో దళిత ఆత్మగౌరవ దీక్షను రేవంత్ విరమించారు. రేవంత్‌రెడ్డికి దామోదర రాజనర్సింహా నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమిం పజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News