Sunday, April 28, 2024

తెరపైకి మళ్లీ డ్రగ్స్ కేసు: సినీ స్టార్స్‌కు ఇడి సమన్లు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారించేందుకు ఇడి అధికారులు రంగంలోకి దిగడంతో పాటు ఈ కేసులో విచారణకు హాజరు కావాలని పలువురు సినీ స్టార్లకు ఇడి అధికారులు బుధవారం సమన్లు జారీచేశారు. ఈక్రమంలో నాలుగేళ్ల కిందట తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. మాదక ద్రవ్యాల రవాణా, మనీలాండరింగ్ కేసుకు సంబంధించి 12మంది టాలీవుడ్ సెలబ్రెటీలు ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 22 వరకు సినీ స్టార్స్ విచారణకు హాజరు కావాలని ఇడి జారీ చేసిన నోటీసులలో పేర్కొన్నారు. ఈక్రమంలో సినీ ప్రముఖులు చార్మి, రకుల్‌ప్రీత్‌ సింగ్, రాణా, రవితేజ, తరుణ్, పూరీ జగన్నాథ్, నవదీప్, ముమైత్‌ఖాన్, నందు, శ్రీనివాస్‌లకు ఇడి సమన్లు పంపించింది. టాలీవుడ్ సినీతారల డ్రగ్స్ కేసు సర్వత్రా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అనేక మంది ప్రముఖుల పేర్లు ఈ కేసుతో తెరపైకి వచ్చాయి. హీరో రవితేజ సోదరుడు భరత్ రోడ్డు ప్రమాదంలో మరణించిన తరువాత టాలీవుడ్లో డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అతని సెల్‌ఫోన్‌లో లభించిన ఆధారాలను అనుసరించి దర్యాప్తు ప్రారంభమైంది.

ఈ క్రమంలో స్పెషల్ సెల్ పోలీసుల విచారణకు హాజరైన టాలీవుడ్ ప్రముఖుల రక్తం, జుట్టు, గోరు నమూనాలను సైతం పోలీసులు సేకరించి పరీక్షలకు పంపించారు. కాగా, ఇడి విచారణకు ఆగస్టు 31న పూరి జగన్నాధ్, సెప్టెంబర్ 2 నటి ఛార్మి, 6న రకుల్‌ప్రీత్ సింగ్, 8న రాణా దగ్గుబాటి, 9న రవితేజ, శ్రీనివాస్, 13న నవదీప్, ఎఫ్ క్లబ్ జీఎం, 15న ముమైత్ ఖాన్, 17న నటుడు తనీష్, 20న నందు, 22న తరుణ్ హాజరు కావాలని ఇడి నోటీసులు జారీ చేసింది.

Drugs Case: ED Summons to Tollywood celebs

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News