- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్: వికలాంగుల రంజీ ట్రోఫీ క్రికెట్ సమరం శనివారం హైదరాబాద్లో ప్రారంభమైంది. నగరంలోని ఎల్.బి.స్టేడియంలో తెలంగాణ-విదర్భ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక, సికింద్రాబాద్లోని జింఖానా గ్రౌండ్లో ఆంధ్రా-కేరళ జట్లు తలపడుతున్నాయి. తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి ఈ పోటీలను ప్రారంభించారు. వికలాంగుల క్రికెటర్లకు ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో రంజీ ట్రోఫీ తరహాలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్టు చైర్మన్ వివరించారు. దేశ వ్యాప్తంగా వివిధ నగరాల్లో ఈ పోటీలు జరుగనున్నాయని తెలిపారు. కాగా, విదర్భతో జరుగుతున్న మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన తెలంగాణ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు సాధించింది.
Disabled Ranji Trophy Cricket has begun
- Advertisement -