Friday, May 3, 2024

తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయల విరాళం

- Advertisement -
- Advertisement -

ktr

 

కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా తమ వంతు సాయం అందించడానికి పలువురు సినీ ప్రముఖలు ముందుకొస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సంక్షోభ సమయంలో కరోనా వైరస్ బాధితుల సహాయార్థం ఓం నమో వేంకటేశాయ ఫిలిమ్స్ అధినేత, ‘శిరిడి సాయి’ సినిమా నిర్మాత, ఏఎమ్‌ఆర్ గ్రూప్ ఛైర్మన్ మహేష్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయలను విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర మంత్రి కెటిఆర్‌ను కలిసి కోటి రూపాయల చెక్‌ను ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా మహేష్ రెడ్డి మాట్లాడుతూ “కరోనా వ్యాప్తి నిరోధం విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలప్రభుత్వాలు అహర్నిశలు కృషి చేస్తున్నాయి. ప్రభుత్వాల సలహాలు, సూచనలను ప్రజలందరూ తప్పకుండా పాటించి కరోనా వ్యాప్తిని అడ్డుకోవాలి. ప్రజలందరూ బయటకు రాకుండా ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలి”అని అన్నారు.

 

Donation of crore of rupees to CM relief fund
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News