Sunday, April 28, 2024

ఈనెల 21వ తేదీన రెండో విడత డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ

- Advertisement -
- Advertisement -

లబ్ధిదారులకు 13,300 ఇళ్ల అందజేత
అధికారుల సమీక్షలో మంత్రి కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్:  హైదరాబాద్‌లో రెండో విడత డబుల్ బెడ్రూం ఇళ్లను ఈ నెల 21వ తేదీన పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమల మంత్రి కెటిఆర్ ప్రకటించారు. నగరంలో డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీపై మంత్రి కెటిఆర్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మహబూద్ అలీ, మల్లారెడ్డి, నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 21న హైదరాబాద్ రెండో దశలో దాదాపు 13,300 ఇళ్లను అందించేలా ఏర్పాట్లు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

అత్యంత పారదర్శకంగా పేదలకు మాత్రమే అందిస్తున్నామని డబుల్ బెడ్రూం ఇళ్ల ఎంపికలో ఎవరి ప్రమేయం లేదన్నారు. లబ్ధిదారులను ఎంపికను ప్రభుత్వ అధికారులకే అప్పగించామని, లబ్ధిదారుల ఎంపికకు కంప్యూటర్ ఆధారిత డ్రా తీస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అర్హులైన లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ప్రమేయం ఏమాత్రం లేదన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో అవకతవకలు జరిగితే పూర్తిస్థాయి బాధ్యత అధికారులదేనని ఆయన తెలిపారు. తప్పు చేసిన అధికారులను ప్రభుత్వ ఉద్యోగం నుంచి తీసి వేసే స్థాయిలో కఠిన చర్యలు ఉంటాయని మంత్రి కెటిఆర్ హెచ్చరించారు.

తప్పు జరగకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్‌లదే….

నిరుపేదలకు సుమారు 50,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఉచితంగా అందిస్తున్నామని కెటిఆర్ తెలిపారు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని జిహెచ్‌ఎంసి అధికారులు కష్టపడి పూర్తి చేస్తున్నారన్నారు. వారికి మంత్రి కెటిఆర్ అభినందనలు తెలిపారు. మంత్రి కెటిఆర్ ఈ మొత్తం ప్రక్రియలో అత్యంత కఠినంగా వ్యవహారించాలని మంత్రి కెటిఆర్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడా తప్పు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లదే ఆయన సూచించారు. ఇళ్ల ఎంపికలో ఏదైనా ఇబ్బందులు జరిగితే వాటిని ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకొస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని కెటిఆర్ పేర్కొన్నారు. మొదటి దశ 11,700 వేల ఇళ్లను ఎలాంటి ఇబ్బందులు లేకుండా పేదలకు అందించామన్నారు.

త్వరలో హైదరాబాద్‌లో గృహలక్ష్మి పథకం ప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించారు. పథకంలో భాగంగా ఇళ్ల స్థలాలు ఉన్న వారికి ఇళ్లు నిర్మించుకునేందుకు రూ.3లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు ఆయన తెలిపారు. నగరంలో నోటరీ ప్రాపర్టీల అంశంలోనూ త్వరలో పూర్తి మార్గదర్శకాలు వస్తాయని కెటిఆర్ తెలిపారు. 58, 59 జీఓల ద్వారా కూడా పెద్ద ఎత్తున ప్రజలకు ఉపశమనం లభించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వివిధ రకాల కార్యక్రమాల ద్వారా డబుల్ బెడ్ రూం ఇంటి నిర్మాణం, పట్టాల రెగ్యులరైజేషన్, నోటరీ ఆస్తుల అంశం వంటి కార్యక్రమాల ద్వారా ప్రతి నియోజకవర్గానికి కనీసం 15 నుంచి 20వేల మందికి లబ్ధి కలుగుతుందన్నారు. మూసీ పరీవాహక ప్రాంతంలో ఉన్న కబ్జాలను తొలగించి, వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని, ఈ కార్యక్రమాన్ని వేగంగా ముందుకు తీసుకువెళతామని మంత్రి కెటిఆర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News