Thursday, May 2, 2024

వనపర్తిలో 1400 డబుల్ బెడ్ రూం ఇండ్లు అందిస్తాం: నిరంజన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Double bed rooms give to poor people

 

వనపర్తి: రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోతున్నవారికి డబుల్ బెడ్‌రూం ఇండ్లు అందిస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి హామీ ఇచ్చారు. అప్పాయిపల్లి, చిట్యాలలో నిర్మిస్తున్న డబుల్‌బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలను మంత్రి నిరంజన్ రెడ్డి పరిశీలించారు. వనపర్తి నియోజకవర్గ పరిధిలోని డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం కొనసాగుతోందన్నారు. వనపర్తిలో 296, అప్పాయిపల్లిలో 160 ఇండ్లు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. చిట్యాలలో 790 ఇండ్లు త్వరలోనే నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామన్నారు. నాలుగైదు నెలల్లో మొత్తం 1400 ఇండ్లు లబ్ధిదారులకు అందిస్తామని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News