- Advertisement -
హైదరాబాద్: సికింద్రాబాద్లో భారీగా డ్రగ్స్ ను పోలీసులు పట్టేశారు. వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు సికింద్రాబాద్ పరిధిలో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఎండిఎంఎ, ఎల్ఎసిడి డ్రగ్స్తో పాటు హాసిష్ అయిల్, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ను ముంబయి నుంచి తీసుకొచ్చి హైదరాబాద్ ముఠా విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పది లక్షల రూపాయలు విలువ చేసే మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. పది గ్రాముల ఎండిఎంఎ, 75 ఎల్ఎస్డి బోల్ట్, 63 ఎక్టిసి పిల్స్తో కిల్ హాష్ ఆయిల్, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసి పోలీసులకు అప్పగించామని వెస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు వెల్లడించారు.
- Advertisement -