Monday, April 29, 2024

యెమెన్‌లో బాంబు పేలుళ్లు: 26 మంది మృతి

- Advertisement -
- Advertisement -

Yemen airport blasts kill 26

సానా: యెమెన్‌లోని అదెన్ ఎయిర్ పోర్టులో బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో 26 మంది మృతి చెందగా 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. విమానాశ్రయంలో రెండు బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ దాడికి ఇరాన్ బ్యాకడ్ హుతి రెబల్స్ పాల్పడిందని యెమెన్ ప్రభుత్వం పేర్కొంది. యెమెన్ ప్రధానమంత్రి మాయిన్ అబ్దుల్ మాలిక్ దిగ్భ్రాంతి వ్యక్తి చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. యెమెన్ ప్రభుత్వానికి చెందిన మంత్రివర్గం విమానాశ్రయంలో ఉండగానే ఈ దాడి జరిగిందని ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. రెడ్ క్రాస్ చెందిన ఓ సభ్యుడు మృతి చెందగా ముగ్గురు గాయపడ్డారని, ఇద్దరు కనిపించడం లేదని ఆ సంస్థ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News