Sunday, April 28, 2024

డ్రైనేజీ లీకేజ్‌పై డివైఎఫ్‌ఐ వినూత్న నిరసన

- Advertisement -
- Advertisement -

ముషీరాబాద్: రాంనగర్ డివిజన్‌లో ఫైర్ స్టేషన్ ఎదురుగా డ్రైనేజీ లీకేజీపై వాటర్ బోర్డు అధికారులు చర్యలు చేపట్టాలని డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో శనివారం వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా భారత ప్రజాతంత్ర యువజన సమైక్య జిల్లా కార్యదర్శి ఎండి జావేద్ మాట్లాడుతూ నిత్యం మూసి నదిలా పారుతున్న ఈ డ్రైనేజీని అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు జరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో చాలాసార్లు స్థానిక కార్పొరేటర్‌కి ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని అన్నారు.

ప్రతిరోజు దుర్వాసనతో స్థానికులు పక్కనే ఉ న్న ఫైర్ స్టేషన్ సిబ్బంది కూడా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జిహెచ్‌ఎంసి అధికారులు, ప్రభుత్వం మంచిగా ఉన్న రోడ్లను, డ్రైనేజీ పైపులైన్లను పదేపదే తవ్వుతున్నారు తప్ప ఇటువంటి డ్రైనేజీ సమస్యలపై ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదన్నారు. వెంటనే డ్రైనేజీ లైన్‌ను మా ర్చి కొత్తలైన్ కనెక్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశా రు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు అనిల్ కుమార్, హస్మిబాబు, లెనిన్, స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News