Wednesday, May 1, 2024

శిల్పాశెట్టి దంపతుల రూ.98 కోట్ల ఆస్తులు అటాచ్

- Advertisement -
- Advertisement -

బిట్ కాయిన్లతో మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రముఖ నటి శిల్పాశెట్టి దంపతులపై చర్యలు చేపట్టింది. ఆమె భర్త రాజ్‌కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల స్థిర, చరాస్తులను అటాచ్ చేసింది. ఇందులో జుహూ లోని ఓ నివాస ఫ్లాట్ శిల్పాశెట్టి పేరు మీద ఉన్నట్టు తెలిపింది. దీంతోపాటు పుణెలోని ఓ నివాస బంగ్లా, రాజ్‌కుంద్రా పేరు మీదున్న ఈక్విటీ షేర్లను అటాచ్ చేసినట్టు వెల్లడించింది. ముంబైకి చెందిన వేరియబుల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ 2017లో ‘గెయిన్ బిట్ కాయిన్ ఫోంజీ స్కీమ్’ ను నిర్వహించింది. ఇందులో భాగంగా బిట్ కాయిన్లలో పెట్టుబడులు పెడితే నెలకు 10 శాతం లాభాలు వస్తాయని

ఆశ చూపి మల్టీ లెవెల్ మార్కెటింగ్ (ఎంఎల్‌ఎం) పద్ధతిలో ఏజెంట్ల ద్వారా ముంబై, ఢిల్లీ నగరాల్లో అమాయకుల నుంచి రూ.6600 కోట్లు వసూలు చేశారు. ఈ మోసం బయటపడటంతో సంస్థ , దాని ప్రమోటర్లపై ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఈ స్కామ్ మాస్టర్‌మైండ్ అయిన అమిత్ భరద్వాజ్ నుంచి రాజ్‌కుంద్రా 285 బిట్ కాయిన్లను తీసుకున్నట్టు ఈడీ పేర్కొంది. వీటితో ఉక్రెయిన్‌లో బిట్ కాయిన్ మైనింగ్ ఫామ్‌ను ఏర్పాటు చేయాలని రాజ్‌కుంద్రా ప్రణాళికలు వేసినట్టు తెలిపింది. ఈ కాయిన్లు ఇప్పటికీ అతడి వద్దనే ఉన్నాయని , ప్రస్తుత మార్కెట్ ప్రకారం వాటి విలువ రూ.150 కోట్లకు పైనే ఉంటుందని వెల్లడించింది. ఈ క్రమం లోనే కేసు దర్యాప్తులో భాగంగా రాజ్‌కుంద్రా ఆస్తులను అటాచ్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News