Tuesday, May 7, 2024

అగ్రిగోల్డ్ స్కాంపై ఇడి ఛార్జిషీట్ దాఖలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అగ్రిగోల్డ్ స్కాంపై ఇడి ఛార్జిషీట్ దాఖలు చేసింది. అగ్రిగోల్ ప్రమోటర్లు ఎవిరామారావు, శేషు నారాయణరావు, హేమసుందర్‌‌ (ముగ్గురు) అనే వ్యక్తులపై ఛార్జిషీట్ దాఖలు చేసింది. వారితోపాటు అగ్రిగోల్డ్ ఫామ్ ఎస్టేట్స్ సహా 11 అనుబంధ కంపెనీలపై ఛార్జిషీట్ వేసింది. ఇడి ఛార్జిషీట్‌ను విచారణకు స్వీకరించిన నాంపల్లి ఎంఎస్‌జె కోర్టు అక్టోబరు 3వ తేదీన కోర్టుకు హాజరుకావాలంటూ అగ్రిగోల్డ్ ప్రమోటర్లు, కంపెనీలకు సమన్లు జారీ చేసింది. ఆరు రాష్ట్రాలకు చెందిన 32 లక్షల మందిని సుమారు రూ.6వేల కోట్ల రూపాయలకు పైగా మోసం చేశారని నిందితులపై అభియోగాలు రావడంతో ఈ కేసులో ఇడి ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేయడంతో పాటు 4,141 కోట్ల రూపాయల ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. అగ్రిగోల్డ్ కేసు విషయంలో బుధవారం ఇడి దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో ప్రమోటర్లు అవ్వా వెంకట రామా రావు, ఎవి శేషునారాయణ రావు అలియాస్ కుమార్, అవ్వా హేమ సుందర వరప్రసాద్ అలియాస్ రాజాలను నిందితులుగా ఇడి పేర్కొంది.

అగ్రిగోల్డ్ ఫామ్ ఎస్టేట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అగ్రిగోల్డ్ కన్‌స్ట్రక్షన్స్, డ్రీమ్‌ల్యాండ్ వెంచర్స్, బుధపాలిత టింబర్ ఎస్టేట్స్, నాగవల్లి ప్లాంటర్స్, హరితమోహన ఆగ్రో ప్రాజెక్ట్, ఆర్కా లీజర్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, అగ్రిగోల్డ్ ఫుడ్స్ అండ్ ఫామ్ ప్రొడక్ట్, అగ్రిగోల్డ్ ప్రాజెక్ట్, బ్రూక్ ఫీల్డ్స్ అండ్ రిసార్ట్, అగ్రిగోల్డ్ ఆర్గానిక్స్ కంపెనీలను కూడా నిందితుల జాబితాలో చేర్చింది. తెలంగాణ,ఎపి సహా ఆరు రాష్ట్రాల్లో సుమారు 32 లక్షల మందిని దాదాపు 6,380 కోట్ల రూపాయల మోసం చేసినట్లు ఎపి సిఐడి అభియోగం మోపింది. ఎపితో పాటు వివిధ రాష్ట్రాల్లో నమోదైన కేసుల ఆధారంగా నిధుల మళ్లింపుపై మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఇడి విచారణ జరిపింది. ఈ కేసుకు సంబంధించి అగ్రిగోల్డ్ ప్రమోటర్లు ఎవి రామారావు, శేషునారాయణరావు, హేమసుందర వరప్రసాద్‌ను ఇప్పటికే అరెస్టు చేసి, విచారణ జరిపింది. అధిక వడ్డీ, ప్లాట్ల పేరిట డిపాజిటర్ల నుంచి డబ్బులు వసూలు చేసి, డొల్ల కంపెనీలకు నిధులు మళ్లించి, వాటి పేరిట ఆస్తులు కూడబెట్టుకున్నట్లు అభియోగం మోపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News