Sunday, April 28, 2024

శివసేన ఎంపి సంజయ్‌రౌత్ భార్యకు ఇడి సమన్లు

- Advertisement -
- Advertisement -

ED Summons MP Sanjay Raut Wife Varsha Raut

ముంబయి: పంజాబ్ నేషనల్ బ్యాంక్ మనీలాండరింగ్ కేసులో శివసేన ఎంపి సంజయ్‌రౌత్ భార్య వర్షారౌత్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ నెల 11న దర్యాప్తు అధికారుల ముందు హాజరు కావాలని ఆదేశించింది. రూ.4300 కోట్ల అక్రమ తరలింపు కేసులో వర్షారౌత్‌ను ఈ నెల 4న ఇడి ఓసారి ప్రశ్నించింది. బ్యాంక్ రుణాల విషయంలో అక్రమ లావాదేవీలు జరిపారని వర్షారౌత్‌పై కేసు నమోదైంది. ఈ కేసులో గతంలో అరెస్టయిన ప్రవీణ్‌రౌత్ భార్య మాధురీరౌత్‌తో అవనీ కన్‌స్ట్రక్షన్ అనే కంపెనీలో వర్షాకు వ్యాపార భాగస్వామ్యం ఉన్నది. రుణాల మంజూరు విషయంలో వీరి మధ్య అక్రమ లావాదేవీలు జరిగినట్టు ఇడి ఆరోపిస్తోంది.

ED Summons MP Sanjay Raut Wife Varsha Raut

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News