Saturday, May 4, 2024

వచ్చే నెలలో ఎన్నికల నోటిఫికేషన్

- Advertisement -
- Advertisement -

ఏప్రిల్ మొదటివారంలో తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికలకు పోలింగ్
హామీల అమలులో కాంగ్రెస్‌కు రోడ్‌మ్యాప్ లేదు

రామ మందిరంతో ప్రతి హిందువు ఇంటా పండగ చేసుకుంటున్నారు : కిషన్ రెడ్డి

హామీల అమలులో కాంగ్రెస్‌కు రోడ్ మ్యాప్ లేదు : కిషన్‌రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఇచ్చి హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వానికి దశ దిశ లేదని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి విమర్శించారు. ప్రజాపాలన పేరుతో తీసుకున్న దరఖాస్తులకు ఇప్పటివరకు ఎలాంటి అతిగతిలేదని మండిపడ్డారు. దేశంలో వచ్చే నెలలో పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని, ఏప్రిల్ తొలి వారంలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగే అవకాశముందని తెలిపారు.

గతంలో కూడా అదే సమయంలో ఎన్నికలు జరిగాయని, మూడోసారి మోడీ అధికారంలోకి రా వడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మోడీ హయాంలో ఒక్క రూపాయి అవినీతి లేకుండా సుస్థిర పాలన సాగుతోందని తెలిపారు. రాష్ట్రంలో గందరగోళ పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో గత ప్రభుత్వం ఇబ్బంది పడిందని, ఇచ్చిన హామీలు నెరవేర్చక చతికిల పడ్డదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా హామీలు అమలు చేస్తుందనేది చెప్పడం లేదన్నారు. భారతీయ సంస్కతికి, ఆత్మగౌరవానికి ప్రతీక అయోధ్య రామమందిరమని, సోమవారం అయోధ్య రామమందిరంలో ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ప్రతి హిందువు పండగ చేసుకుంటున్నారని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News