- Advertisement -
మనతెలంగాణ,హైదరాబాద్: క్రిమిసంహారక మందుతాగి ఉద్యోగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన నగరంలోనిన అరణ్య భవన్లో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…కొడంగల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీస్లో సెక్షన్ ఆఫీసర్గా మోహినుద్దిన్ పనిచేస్తున్నాడు. తన ఆఫీస్లో వివిధ పనుల నిమిత్తం సొంత డబ్బులు పెట్టి పనులు చేయించాడు. వాటిని చెల్లించికుండా పైఅధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కూడా అధికారులు బిల్లులు చెల్లించకపోవడంతో నగరంలోని అరణ్య భవనానికి వచ్చి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు మోహినుద్దిన్ వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సైఫాబాద్ పోలీసులు తెలిపారు.
Employee attempt suicide at Aranya Bhavan
- Advertisement -