- Advertisement -
హైదరాబాద్: గులాబ్ తుఫాను ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు టెలీ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. వచ్చే 24 గంటల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అప్రమత్తం కావాలన్నారు. జిల్లా కలెక్టరేట్లలో ప్రత్యేకంగా కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని మానిటరింగ్ చేయాలని అధికారులకు సూచించారు. లోతట్టు ప్రాంతాలు చెరువులు, కుంటలు, బ్రిడ్జిల వద్ద ప్రత్యేకంగా అధికారులను నియమించి పరిస్థితులను సమీక్షించాలని, ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు చేపట్టాలని చెప్పారు.
Errabelli Dayakar Rao review on Rain in Warangal
- Advertisement -