Tuesday, May 7, 2024

ధరణి రైతుల కొంప ముంచింది: ఈటల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ధరణి లక్షల మంది రైతుల కొంప ముంచిందని బిజెపి హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ధరణిలో ఎన్నో తప్పులు జరిగాయి.నిషేధంలో ఉన్న భూములు ఎందుకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. మియాపూర్ స్కాం ఎందుకు బయటపెట్టడడం లేదు?. 111 జీవో పరిధిలో రైతుల వద్ద కంటే, బడా నేతల వద్దే ఎక్కువ భూములు ఉన్నాయి. ఎవరి లాభం కోసం 111 జీవో ఎత్తివేస్తున్నారు. కొత్త సచివాలయంలో ప్రజాప్రతినిధులకు, ప్రజలు అనుమతి లేదు.. మరి ఎవరికోసం సచివాలయం కట్టారు’ అని తీవ్ర స్థాయిలో  మండిపడ్డారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News