Thursday, May 2, 2024

ఏ కారణంతో రైతు చనిపోయినా రైతు బీమా: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

Farmer dies for any reason with Rythu bheema

 

హైదరాబాద్: ఏ కారణంతో రైతు చనిపోయినా బీమా పరిహారం చెల్లిస్తున్నామని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. అమీర్ పేటలో నాబార్డు రాష్ట్ర ప్రణాళిక సదస్సు-2021 జరిగింది. నాబార్డు వార్షిక రుణ ప్రణాళికను హరీష్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యుత్, నీటి పారుదల రంగాల్లో మార్పులు తీసుకొచ్చామన్నారు. రైతులకు నకిలీ విత్తనాల బెడద లేకుండా చేశామని, సీజను ప్రారంభానికే ముందే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామన్నారు. ఈ సదస్సులో ప్రణాళిక సంఘం అధ్యక్షుడు వినోద్ కుమార్, టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, నాబార్డ్ సిజిఎం రామకృష్ణా రావు  పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News